Pages

Tuesday, January 10, 2012

గాలి పటాలు..........................

                         "లికాలం", "హైటెక్" యుగంలో కొన్ని సాంప్రదాయాలు కనుమరుగవుతూ ఉన్నాయి. దురదృష్ఠకరం. పూర్వీకులు ఈ పద్దతులన్నీ ఒక మంచి ఆలోచనలతో రూపకల్పన చేసారు. ఆవు పేడ, పంచకం యొక్క విసిష్ఠమయిన, శాస్త్రీయమయిన, గుణాలను దృష్టిలో పెట్టుకునే ఈ "మకర సంక్రాంతి" పండుగతో ఎక్కువగా ముడిపెట్టారు.
                         "సంక్రాంతి", "సంక్రమణం" అంటే మారడం, చేరడం అని అర్ధం. జగత్తును వెలిగిస్తూ సకల కోటినీ ప్రదీప్తం చేస్తూన్న "సూర్య భగవానుని" గతిని బట్టి "సంక్రాంతి" ఏర్పడుతోంది. ఉదయముననే లేచి చల్లటి వాతావరణములో ఇంటిముందు కళ్ళాపి చల్లి రంగవల్లులు దిద్ది, గొబ్బిమ్మలు పెట్టి, అమ్మాయిలు తలస్నానం చేసి పట్టు పరికిణి, ఓణీ, కాళ్ళకు వెండి గజ్జలు తగిలించుకుని ఇంట్లో, వీధుల వెంట అలా నడుస్తూ వెళ్తుంటే  ఆ అందం మనస్సుకు ఒకరకమయిన అహ్లాదవాతావరణమును కలుగజేస్తుంది.   
                         ఈ పండుగలనేవి ఒక ఊరులో లేదా ఒక వీధిలో వారంతా ఒకరికొకరు కలుసుకుని మంచి, చెడుల గురించి విశ్లేషించుకుని అవసరానిబట్టి ఒకరికొకరు సహాయపడటానికని ఏర్పరిచిన "సాంప్రదాయ పధ్ధతి".  
                         ఈ "మకరసంక్రాంతి" లోని "ఉత్తరాయణ పుణ్యకాలం" గురించి అందరికీ తెలిసినదే. దేవతలకు "ఉత్తరాయణం" పగలు, "దక్షిణాయనం" రాత్రి. వెలుగును అభిలషించడం జీవకోటికి సహజం కనుక పుణ్యప్రదమైన దేవలోకంలో దక్షిణాయన కాలమందు దక్షిణ ద్వారం తెరచి, ఉత్తర ద్వారం మూసియుంచుట చేత అది పాపహేతువని, ఉత్తరాయణ కాలంలో దక్షిణ ద్వారం మూసి ఉత్తర ద్వారం తీసి ఉండటం వలన అది పుణ్యప్రదమైనదని విస్వాసం. 
                         ప్రతి ఇంటి ముందు తెల్లారేసరికి ముగ్గు పెట్టడమనేది మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి. ముగ్గు పెట్టేందుకు ఉపయోగించే సున్నపురాయి, బియ్యపు పిండి తెలుపు రంగులో ఉండటం శాంతికి చిహ్నంగా భావిస్తారు. ప్రొద్దునే కళ్ళాపి చల్లి, ముగ్గుపెట్టి, శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి  ప్రవేసిస్తుందని ఓ నమ్మకం.  ముఖ్యంగా ఈ సంక్రాంతి మొదలయినప్పటినుండి ముగ్గుల రూపంలో స్త్రీలలోని సృజన బయట పడుతుంది. ముగ్గులుపెట్టడంలో, వంకర్లు లేకుండా గీతలు కలపడంలోనూ వారి ప్రత్యేకమయిన నేర్పు, ఓర్పూ తెలుస్తుంది. ఇది కూడా ఒక కళే. ఇలా ఇంటి ముందు తీర్చి దిద్దే రంగవల్లులతో ఇంటికీ ప్రత్యేక శోభ వస్తుంది.
                         భోగి పండుగ: ఈ రోజున ఆవు పేడతో చేసిన పిడకలతో మంటల వేస్తారు. శరీరానికి నువ్వుల పిండితో నలుగు పెట్టి స్నానం చేసి భోగి మంట దగ్గర చలి కాచుకోవడం వలన శరీరంలో ఉండే ఆమ్ల  గుణాన్ని హరించి శ్లేష్మాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఒంటికి నలుగు పెట్టుకోవడంవలన చర్మం పైన చేరిన మలినాలను వదిలించడమే కాకుండా చర్మానికి మృదుత్వాన్నిస్తూ, పగుళ్ళురాకుండా కాపాడుతుంది. పాతవాటిని వదిలి, క్రొత్తవాటికి స్వాగతం పలుకడము, దారిద్ర్యంవంటి చెడును మంటల్లో నశింపజేసి మంచిని ప్రసాదించమని "అగ్ని" దేవుడిని ప్రార్ధించటమూ  ఈ "భోగి" పండుగలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. విజ్ణానపరంగా చూస్తే భోగి మంటల్లో వేసే ఆవుపేడ పిడకల పొగను పీలిస్తే ఊపిరితిత్తుల చెవి, ముక్కు గొంతుల వ్యాధులు నయమవుతాయని వైద్యులు దృవీకరించారు.

                         సంక్రాంతి పండుగని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. దాదాపుగా 2500ల సం.వ. లకు పూర్వమే "విష్ణు శర్మ" తను వ్రాసిన "పంచతంత్రం" లో ఈ గాలి పటాలగురించి  ఉదహరించారు. మన దేశంలో గాలి పటాలను ఎగురవేయని ఊరు, వీధి లేదంటే అతిశయోక్తి కాదేమో. పిల్లలు, పెద్దలు ఒకరేమిటి అందరూ చాలా ఆనందంగా ఎగురవేస్తారు. గుజరాతులో "ఉత్తరాయణ" ఆరంభానికి శూచకంగా అంతర్జాతీయ పతంగుల ఆటల పోటీలు నిర్వహిస్తునే ఉన్నారు.  
 http://www.aryabhatt.com/fast_fair_festival/festivals/international%20kite%20festival.htm 
http://hinduism.about.com/cs/festivals/a/aa011103a.htm     
కావున ఈ సంధర్భముగా మీకు, మీ కుటుంబ సభ్యులెల్లరకూ ఆరోగ్యకరమయిన, ఆనందమయిన, పుణ్యప్రదమయిన జీవితాన్ని ఇవ్వవలసినదిగా "ముక్కోటి దేవతలను" కోరుకుంటూ......

13 comments:

  1. మూర్తిగారూ మంచి వ్యాసం అందించారు..ధన్యవాదములు

    ReplyDelete
  2. moorty garu
    idi ee taram variki avasaramaina samachaaram
    ilanti krushi konasaaginchandi
    Subhash

    ReplyDelete
  3. ramakrishna atchutuniJanuary 11, 2012 at 10:42 AM

    Murthy garu,

    It is a very interesting topic ,which will give lot of information and foresight

    ReplyDelete
  4. జ్యోతిర్మయి, సుభాష్ మరియు రామకృష్ణ గార్లకి ధన్యవాదములు.

    ReplyDelete
  5. dear sir this is very help full to youth and our Hind re legions

    ReplyDelete
  6. dear murthy garu meeku challa danyavadalu

    ReplyDelete
  7. సాగర్ గారు,
    మీ కామెంట్ కు ధన్యవాదములు.

    ReplyDelete
  8. Priyamaina Ramu,

    Ee taram pillalu kooda ee samskaranni patinchalani manaspurthi ga korukuntu, neeku, nee kutumbamunaku maa hryudayapoorvaka sankranti subhakankshalu teliajestunnanu.

    Sai Krishna.

    ReplyDelete
  9. Thank you Sai Krishna garu,
    for your suggestion.

    ReplyDelete
  10. చక్కగా చెప్పారు!

    ReplyDelete
  11. రసజ్ణ గారు,
    మీ compliment కు ధన్యవాదములు.

    ReplyDelete
  12. Sankranthini Galipatala pandaga ani antarani mee vyasam dwarane naaku telisinidi. Thank You Very much Sir!

    ReplyDelete
    Replies
    1. Namastae Surya garu,
      Thank you for the compliment

      Delete