Pages

Tuesday, May 15, 2012

శ్రీ హనుమత్జయంతి.........

పాఠకులందరకు
 "శ్రీ హనుమత్జయంతి
సంధర్భమున నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  



మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజాం వానరయూధముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి.


Monday, February 27, 2012

మనము - మన సెక్యులరిజం!!!


Add caption
బానిసత్వపు సంకెళ్ళు తెంచుకుని స్వతంత్రులమయిన తరువాత మన దేశానికి కావలసిన "రాజ్యాంగాన్ని" వ్రాసుకున్నాము. రకరకాల మతాలూ, వాళ్ళ ఆచారాలకు విఘాతము కలగకుండా ఉండాలని రాజ్యాంగంలో "మతము", "ఆధ్యాత్మికత" అనే అంశం మీద తీవ్రమయిన చర్చ జరిగినది.

రాజ్యాంగ కమిటి లో --- "సెక్యులర్" రాజ్యం ప్రత్యేకంగా ఏ మతాన్ని బలపరచకూడదు, కాని అదే సమయంలో రాజ్యం సెక్యులర్ కాబట్టి ప్రజల ఆధ్యాత్మికత విద్యకు ఆటంకము కల్పించకూడదని, సెక్యులర్ రాజ్యం అంటే మత వ్యతిరేకం, మతంతో సంభంధం, లేదా దేవుడు లేదనటం కాదు. ఇంకా వివరంగా  "సెక్యులర్ రాష్ట్రం అనగా దేవుడు  లేకపోవటం, మతాన్ని కూకటి వేళ్ళతో  పీకేయటం, మతాన్ని వ్యతిరేకించడం కానే కాదన్నారు". మతానికి సంభందించిన అసలయిన విలువలను, మనస్సు (ఆత్మ) కు సంభందమయిన విలువలను ఒకే దృష్ఠితో చూడగలిగేదే "ధర్మం". మన రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ముద్రికలో "ధర్మచక్ర ప్రవర్తనాయా" అని, మన లోక్ సభ బిల్డింగ్ మీద 
          " నాసా సభా యత్ర న సంతివృద్ధా; వృద్ధా నతే యో న వదంతి ధర్మం" అని ఉన్నది. 
 "రాజ్యం" అనేది నిత్యం రోజు జరిగే వ్యవహారములకు సంభందించిన వ్యవస్థ కాబట్టి మతము, నమ్మకాలు అనే వాటితో సంభంధం ఉండకూడదు  అనే అంశాలను  చేర్చాలని విపరీతంగా ప్రయత్నించారు, అదేవిధముగా, ఇక్కడ అనేక మతాలున్నాయి కాబట్టి ఏ మతాన్ని "రాష్ట్ర మతంగా" అంగీకరించాలి అని అడిగారు. ముస్లిం లీగ్ సభ్యులు కొంత మంది Directive Principle లో ఉన్న "ఉమ్మడి పౌర చట్టం" ని వ్యతిరేకించారు

స్వాతంత్రం  వచ్చి ఇన్నేళ్ళయినా  "సెక్యులర్" అనే పదం మీద రాజకీయ నాయకులకు ఏకాభిప్రాయం ఇప్పటికి లేదు. ఒకరు "సెక్యులరిజం", మరొకరు "సూడోసేక్యులరిజం" అని వాదించుకుంటూనే వున్నారు.   

అసలు ఈ "సెక్యులరిజం" ఎక్కడిది, ఎందుకొచ్చింది.
పూర్వం యూరప్ లోని రోమన్ కథోలిక్ చర్చికి అధిపతి అయిన  పోప్ కు మతాధికారం తో బాటు రాజ్యాధికారం కూడా ఉండేది. ఈయన మిగతా రాజ్యాదికారులవలె  చిన్న చిన్న రాజ్యాలను కలుపుకునేవారు. 1281 లో "లోబోనఫేస్" 8 పోప్ గ వచ్చినతరువాత ఫ్రాన్స్ రాజు ఫిలిప్ తో పడకపోవటం మొదలయినది. మత సంభందమయిన వ్యవహారం తప్ప రాజ్యానికి సంభందిచిన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి అర్హత లేదని ఫిలిప్ పెద్ద ఉద్యమంగా దారిపొడవునా ఉన్న రాజ్యాలను కలుపుకొంటూ పోప్ మీదకు దండెత్తాడు. దీనివలన ఎక్కడికక్కడ ఆ దేశపు జాతీయవాదం బలపడి చివరకు "జాతి" సంభందమయిన రాజ్యాలుగా పుట్టడడం మొదలవడమే "సెక్యులర్" యొక్క పరిణామం. పోప్ అన్ని క్రైస్తవ రాజ్యాలు తనక్రింద ఉంటాయనుకొన్నారు. కాని పోప్ కేవలం మతానికి ప్రతినిధి అని, రాజ్యమనేది మతానికంటే భిన్నముగా, స్వతంత్రముగా ఉన్నదని తరువాత తెలుసుకున్నారు.
మరి మన దేశం లో: ఇక్కడ "రాజ నీతి" రాజకీయ వ్యవస్థదే ఉన్నత స్థానమని అంగీకరించింది. మతాధికారులు రాజ్యాధికారం చేలాయించలేదు. రాజకీయ అధికారం మీద ఎప్పుడూ నిఘా (చట్టం, శాసనం) ఉండేది. వేద కాలంలో ఈ పద్ధతికి  చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. రాజ్యం ఈ "నియమ" కి లోబడే ఉండాలి. ఈ నియమాల  సముదాయమే ధర్మానికి మూలమయి రాజ్యపాలన వలన ప్రజల నైతిక, భౌతిక సంపదను కాపడగలిగేది.
మన దేశంలో "దర్మం"మతం కన్నా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. సమాజ, వ్యక్తీ జీవితం లో అనుసరించాల్సిన నియమాలు, కట్టుబాట్ల సముదాయాన్నే "ధర్మం" అంటాము. ధర్మమనేది కేవలం ఒక దేశానికి, ఒక కాలానికి లేదా ఒక ప్రాంత ప్రజలకు సంభందించినది కాదు. అదే ధర్మం ఒక సమూహముతో, లేదా ఒక వ్యవస్థతో కలిసుంటే అప్పుడది మతమవుతుంది. సత్యం, అహింస, బుద్ది సంపన్నతి, జ్ఞానం, నిదానము, క్షమ, దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, పవిత్రత అనే 10 రకాల విశేష గుణాలు "ధర్మం" కు ఉన్నాయని "మను స్మృతి" లో చెప్పబడింది.  
ధర్మానికి - మతానికి గల తేడ మతానికి కొన్ని ఖచ్చితమయిన నమ్మకాలు ఉంటాయి. ఒక వ్యక్తీ ఎంతవరకయితే ఆ నమ్మకాలకి లోబడి ఉంటాడో అంతవరకే ఆ "మతానికి"  సభ్యుడు. ఆ నమ్మకాలను వదిలేస్తే ఆ "మతం" తో సంభంధం తెగిపోయినట్లే. "ధర్మం" మతం మీద ఆధారపడలేదు. సుగుణాలు కలిగి ఉండటమే "ధార్మికత". ధర్మం అనేది ఒక జీవన పద్ధతి. కేవలం నమ్మకాల మీద ఆధారపడి జీవించటం కాదు. కాబట్టి భారతీయ భావనలో "సెక్యులర్" అంటే "స్వధర్మ సమభావం".
ఒక సభలో  "నీవు ముస్లిం, నేను హిందూ. ఇద్దరివీ వేర్వేరు మతాలూ, నమ్మకాలు, అసలు విశ్వాసమే లేదు. కాని మన సాంస్కృతిక వారసత్వం మటుకు ఒక్కటే" అని పండిట్ నెహ్రు చెప్పారు. 
దేశంలో "సామాజిక, ఆర్ధిక విప్లవం" తీసుకు రావడానికని  (emergency సమయంలో) 1976 లో "రాజ్యాంగం" లో 42 వ సవరణ క్రింద ఈ "సెక్యులర్" ను జేర్చారు. మన రాజ్యాంగంలో ఈ "సెక్యులర్" అనే పదం లేకుండానే అన్ని మతాల వారికి మతంతో సంభంధం లేకుండా ప్రతి పౌరుడుకి సమాన స్థాయి కల్పించింది. అంతకముందు జరిగిన మత ఘర్షణలు కన్నా ఈ సవరణ తరువాతే మతః కలహాలు ఎక్కువయినాయి అనుకుంట. ఒక ప్రక్క అన్ని మతాలు సమానమే అంటూ మరొక ప్రక్క చట్టంలో కొన్ని మతాలకు ప్రత్యేకమయిన "ఏర్పాట్లు" కల్పించడం వలన మత కలహాలకు శ్రీకారం చుట్టబడినది. వాస్తవానికి ఈ చట్టాలవలన నిజంగా లబ్ధిపొందేది రాజకీయ పార్టీలుమాత్రమే. కారణం "సెక్యులర్" అనేదాన్ని జాతీయ  కారకంగా ఉన్నా,   క్రియాత్మకంగా అవలంబించకపోవటం, మత సంభందమయిన విషయాలలో రాజ్య పాలన జోక్యం (ఓట్ల కోసం), అన్ని మాతాలను సామానముగా చూడకుండా బ్రిటీషు వాడి "విభజించి పాలించే" పద్ధతిలాగాషాబానో విడాకుల విషయమయిThe Supreme Court Judgement on 23rd April 1985 కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అప్పటి central government తీసుకున్న నిర్ణయంతో వచ్చిన మత విభేదాలను సమతుల్యం చేయటానికని అయోధ్యలోని "రామ మందిర్" కు కోర్ట్ తీర్పు వలన వేసిన తాళాలను 1985 లో తీసేయటంవలన "మత"  పరంగా "ఓటు" సంపాదనకు, మరింత మత కలహాలకు అవకాశం ఇచ్చినట్లయినది అని నా ఆలోచన. M.F. Hussain, Salman Rushdie, Tasleema Nasreen, T. J. Joseph, A.K. రామానుజన్, ఇలా చాలా సంఘటనలు జరిగాయి.Link

రాజ్యంగా పరిషత్ సలహా సంఘ అద్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఎన్నికల విధానంలో ఈ మతైక ధోరణిని ప్రవేశపెట్టటం మంచిది కాదు. ఈ ధోరణే దేశ విభజనకు దారితీసింది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఇక్కడ మిగిలిన వారంతా ఒకే "జాతి" అని అంగీకరించాము. కాబట్టి మనము ఇకనయిన రెండు జాతుల సిద్ధాంతానికి స్వస్తి పలికితే దేశ పురోగతిని చూడగలుగుతాము" అన్నారు.
రాజ్యాంగంలో ఎంత  పటిష్ఠమయిన నియమావళిని పొందుపరుచుకున్నా, ఆచరణలోకి తీసుకురానంతవరకు అవి నిరుపయోగమే. ఎన్నికల్లో అభ్యర్ధి గెలవాలంటే కనీసం 50% పైన ఓట్లు తప్పనిసరిగా రావాలని నిభందన కనకే  ఉంటే అప్పుడు ఈ రాజకీయ అభ్యర్ధులు మత భేదం లేకుండ తప్పనిసరిగా అందరినీ కలుస్తారు. 
                               
మన కళ్ళముందు కనబడిన చరిత్రకు, మరల వేరేవారెవరో చరిత్ర వ్రాయనవసరంలేదు. మత ద్వేషాలను పెంచే "ఓటు" బ్యాంకు లోని సత్యంను అందరూ గ్రహించగలిగిన రోజున  సమాజం సమతుల్యముగా, అందరం సుఖంగా ఉండడానికి వీలుగా ఉంటుందని, ఉండగలదని నా నమ్మకము, నా ఆలోచన..................

                         --------------"సర్వే జనాః సుఖినో భవంతు"--------------

Sunday, February 12, 2012

ఒక సంఘటన.........


                                నేను కుటుంబ సమేతంగా మా అన్నయ్య వాళ్ళ ఊరునుండి తిరిగి మా ఊరు బయలుదేరటానికి రైల్వే స్టేషనుకు వచ్చాము. రైలు రావటానికి ఒక గంట ఆలశ్యం అని అనౌన్స్ చేసారు. సరే కదా అని నేను, నా పాప రైల్వే  ప్లాట్ఫార్మ్ మీద అలా చిన్నగ నడుచుకుంటు అక్కడ ఉన్న ఫ్లైయోవర్ ఎక్కుతున్నాము. ఒక 3 లేద 4 ఏళ్ళ వయస్సుగల పిల్ల వాడు ఆ ఫ్లైయోవర్ మెట్లు ఎక్కి, మళ్ళా దిగుతూ అలా ఆడుకుంటున్నాడు. నేనొకసారి చుట్టూ  పరికించి చూసాను. మెట్లమీద అంతగ జన రద్దీ లేదు. ఎవరిదోవన  వారు వెళ్తూనే  ఉన్నారు. బహుశః  నా పిల్లవాడనుకున్నారో ఏమో! తప్పనిసరిగ ఈ పిల్లవాడు దారి తప్పాడు అని అనుమానమొచ్చి వాడు మెట్లుదిగుతున్నప్పుడు వాడికి అడ్డముగ నుంచున్న. అతను పక్కకితప్పుకుని మెట్లు దిగటానికి ప్రయత్నించాడు. మళ్ళీ అడ్డముగ నుంచున్న. అలా మూడు నలుగు సార్లు చేసేటప్పటికి ఆ పిల్లవాడు బిక్క మొహమేసుకుని ఒక్కసారిగ "అమ్మా" అంటూ ఏడుపు మొదలెట్టాడు.

                                 నిజంగా "ఆ ఏడుపు" వింటే ఎంత కర్కోటకుడికి అయిన హృదయం ద్రవించక  తప్పదు. ఒక బేల తనము, భయము, ఆందోళన అనేవి  ఖచ్చితముగ వ్యక్త పరచలేని వయస్సు,  కన్న తల్లికి తప్ప ఎవరికి వర్ణించడాఇనికి కూడా వీలుగానిది ఆ పిల్లవాడి ముఖములో చూసాను. మా పాపకు కొంచెం జాలేసి ఎవరు లేరనుకుంట "నాన్న ఈ తమ్ముడుని మనం పెంచుకుందాము" అంది. నాకు చాలా సార్లు ఇలాంటి ఆలోచనే వచ్చేది. పోలీసులకు అప్ప చెప్పితే? సహజముగ ఏ మనిషి తొందరగ ఎదుటి వారి మీద, అది కూడా ఇలాంటి  సంధర్భములో నమ్మకము కుదరదు. ఎందుకంటె పొరబాటున ఇలా తప్పిపోయిన వాళ్ళు అందకూడని చేతికి అందే దానికన్న మన దగ్గరే ఉంటేనే బాగుంటుందనే ఆలోచన చాలామందికి కలుగుతుంది. అదే సమయములో కొంతమందికి కుటుంబ పరిస్థితులు సహకరించక పోవటము వలన  ఇంకొకరి అప్పచెప్పి వెళ్ళిపోతారు.

                                 నేను, మా పాప అక్కడే మెట్టు మీద కూర్చుని బాబుని నా ఒళ్ళో కూర్చొబెట్టుకుని బుజ్జగిస్తున్న. ఆ సన్నివేశం చూస్తే ఎవరికయిన మా పిల్లవాడే అనుకుంటారు. (పిల్లల్ని ఎత్తుకెళ్ళేవారు  ఆచరించే పద్దతులలో ఇదొకటి. ఎవరికీ అనుమానం రాదు). మా పాపకని కొన్న చాక్లెట్లు తీసి పిల్లవాడికి ఇచ్చా. ఒద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతూ  "అమ్మ" కావాలి అన్నాడు. "ఇవిగో మీ అమ్మ ఇచ్చింది తిను ఇంకా చాలా వున్నాయి అవి కూడా నీకే ఇస్తా,  మీ అమ్మదగరకు వెల్దాము రా అన్న. కొద్దిగ వాడి ముఖములోని ఏడుపు తీవ్రత తగ్గి చిన్నగ మాకు సహకరించాడు. పాపం పిల్లవాడు. పెద్దవాళ్ళే మోసపోతున్నారు (ఇంకో విధముగ). 

                                ఆ బాబుకి ఈ మాయా (కుల, మత, ప్రాంత, రాజకీయ, చరిత్ర, ఆర్ధిక, సిద్ద్దాంత, ద్వేషాల) ప్రపంచం గురుంచి తెలుసుకునే వయస్సుకు  ఇంకా ఎదగలేదు. అక్కడ రైలు ఎక్కటానికి వచ్చిన వాళ్ళలో ఈ బాబుకు సంభందించిన వాళ్ళెవరయిన  ఉన్నారేమో ఒక సారి చూద్దామని ( సహజంగా ప్లాట్ఫార్మ్ మీద ఉన్నవారందరూ రైలు వచ్చే దిశగా చూస్తుంటారనే ఆలోచనతో) మా పాప, నేనూ  బాబు చెరొక చేయి పట్టుకుని ప్లాట్ఫార్మ్ అంచుగ నడవనారింభించాము. 

                                కొంత దూరం వచ్చేసరికి ఒక ఆవిడ మా దగ్గర ఉన్న పిల్లవాడిని చూసి హడావిడిగా మా వైపు వస్తోంది. ఆమెకు నాలుగు చివాట్లు  పెట్టాలనే ఉద్దేశ్యంతో పిల్లవాడిని ఆవిడకు కనబడకుండా కొంచెం వెనక వైపుకు ఉంచాను. మా పిల్లవాడండి అంది. ఎవరు అని చాలా కోపంగా అరిచా. ఆ అరుపుకి ఒక్కసారి అందరూ మా వైపు చూసారు. నా సంస్కారం కోల్పోయి పలురకాలుగా ఆమెను తిట్టాను. (అప్పుడే అనిపించింది  ప్లాట్ఫార్మ్ మీద టీవిలు ఉండకూడదని). ఆమె వెనుకనే వచ్చిన ఒకతను ఏమిటండి మీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పొరపాటు ఎవరికయినా జరుగుతుంది. అంతమాత్రానికే అలా మాట్లాడాలా. ఆ తల్లి రెండు చేతులు జాపగానే  "అమ్మ" అంటూ   పిల్ల వాడు ఒక్క ఉదుటున తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగ కౌగలించుకున్నాడు. ఎంతయినా తల్లి ఒడిలో దొరికే సుఖం ఇంక ఎక్కడా దొరకదు. ఇది ప్రకృతి మనకిచ్చిన గొప్ప కానుక.   

                                  ఏమండి కొన్ని పొరపాటులవలన కలిగే నష్ఠం ప్రకృతి కూడా మనకు తిరిగి ఇవ్వదు. ఒక్కసారి ఊహించుకోండి! మనము  ప్రయాణం చేసే రైళ్ళల్లో కొంతమంది పిల్లలు వాళ్ళ వంటి మీద చొక్కా తీసి దేక్కుంటూ కంపార్టుమెంటు ఊడుస్తూ అడుక్కుంటున్నప్పుడు మనమే అంటాము "చదువుకోవటానికి బద్దకమేసో, చెడు అలవాటులకు అలవాటుపడ్డాడనో, తల్లిదండ్రులకు భుద్దిలేదనో  ఇంకా చాలా రకాలుగా తిడతాము. అదే అమ్మాయి అయితే C/o వ్యభిచార కొంపలు".

                                 మరొక  మూడు సంఘటనలు వేర్వేరుగ  జరిగాయి. ఒకటి బస్సులో, ఎవడో ఒక అమ్మాయిని (షుమారు 10సం.లుంటాయి) సినిమాకని తీసుకు వచ్చి వేరే బస్సు ఎక్కుదాము, నీవిక్కడే ఉండు వాటర్ బాటిల్ తెస్తా అని వెళ్ళగానే తెలివిగ ఈ అమ్మాయి వేరే బస్సు ఎక్కింది. అనుకోకుండా ఆ బస్సులోనే నేనున్నా. రెండవది నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో ఆగినప్పుడు ప్లాట్ఫార్మ్ మీద ఒకడు ఒక అమ్మాయిని పట్టుకున్న తీరు చూసి నేను రైలు దిగి వాడి దగ్గరకు వెళ్ళగానే అమ్మాయిని వదిలి హడావిడిగా, స్పీడుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవది ఒక పిల్లవాడు (షుమారు 8సం.లుంటాయి) వాడి స్నేహితుడు (షుమారు 12సం.లుంటాయి) రైల్లో నా ఎదురుగ కూర్చున్నారు. సరదగా ఊళ్ళు తిరుగుదామనిట. ఇంట్లో వాళ్ళకు తెలియకుండ వచ్చారు.

                                 పై మూడు సంధర్భములలో నేను నా ఆఫీసుకు వెల్తున్నప్పుడు జరిగినవే. నా ఆఫీసులో కూర్చోబెట్టుకుని సమోసాలు, బిస్కెట్లు అవి ఇచ్చి తింటూ ఉండు అని నా వర్క్ చూసుకుంటు మధ్యలో ఏమిచేస్తున్నారో చూస్తున్నాను. నా సిబ్బందిని సరదాగా కబుర్లు చెప్పండి అన్నా. చిన్నగ నా అఫీసు వాతావరణానికి అలవాటయ్యారు అనిపించినప్పుడు వాళ్ళకి ఒక తెల్ల కాగితం ఇచ్చి, నీకు ఉత్తరము వ్రాయటం వచ్చా. "సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరుకెళ్ళి అక్కడ ఏమేమి చూసావో" మీ అమ్మకు చెప్పాలికద. పాపం మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది కద అని అక్కడనుండి ప్రక్కకొచ్చాను. ఆ కాగితం మీద వ్రాసిన వివరాలను బట్టి, వాళ్ళతో సరదాగ మాట్లాడుతూ వివరాలు సేకరించిన మీదట  పిల్లలు, నేను అదృష్ఠవతులమయ్యాము. వాళ్ళు వాళ్ళ తల్లుల దగ్గరకు, దానివలన నాకు మనశ్శాంతి  దొరికింది. ఇలాంటి సంఘటనలను చాలా మంది ఎదుర్కునే  ఉంటారు. నా తోటి ఉద్యోగులు "ఎమయ్య నీకు ఎప్పుడూ ఇలాంటివే కనబడుతాయేంటి" అన్నారు. ఏమో! నా తల్లిదండృల సంస్కారం వలన అనుకుంట.

                                కాలం గడుస్తున్నకొద్ది ఇలా పిల్లలను ఎత్తుకెళ్ళటం అనేవి పెరుగుతున్నాయి. మరి దీనిని ఏరకమయిన అభివృధ్ధ్ధి అనవచ్చు. ఈ అభివృధ్ధికి "ఏ సిధ్ధాంతాన్ని" ప్రామాణికంగా తీసుకోవాలి. సమాజములో పూర్వం కన్నా మెరుగుబడిన  విద్య, సాంకేతిక, శాస్త్రీయ, సాంకేతిక, ఆర్ధిక, నైతిక, మానవత, సంస్కార (కొంతమంది అనుకునె) విలువలా!! అని ఒక సారి నాకు నేనే ప్రశ్నించుకుంటే వచ్చిన  సమాధానమొక్కటే. పూర్వం మనకు భోధించిన "విద్యా - బుధ్ధులలొ", బుధ్ధిని (క్రమశిక్షణ) తీసేసి కేవలం విత్తును సంపాదించే విద్య, తోటి మానవుడు గురించి ఆలోచింపజేసే  "సామాజిక స్పృహ" కావలసినంతగ లేకపోవటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  "ధర్మపధముగా" నడవ వలసిన  చోట దాదాపుగా తప్పటడుగు పడుతోంది.

                              ఆధునికత అంటే ఉన్నదానిని తీసేసి కొత్తదనాన్ని స్వీకరించటము కాదు. పిల్లలకు కనీసం ప్రాధమిక విద్యా దశ వరకు  మన దేశ భౌగొళిక, సామాజిక అవసరాలను దృష్ఠిలో పెట్టుకుని సరి అయిన "విద్యా భుధ్ధులను" అందిస్తే తరువాత తరం వారయినా  పెద్దయిన తరువాత సమాజములో ఇంకా మంచి వాతావరణమును నెలకొల్పవచ్చు అనే  నమ్మకంతో నా ఈ ఆలొచన............   

                                        "యత్భావం తత్భవతి

                                     ఋగ్వేదంలో ఒక సూక్తి -  
                                 "ఆనో భద్రహ క్రతవోయంతు విశ్వతహ". 
                              Let noble thoughts comes to us from all sides. 


                                          సర్వ్ జనా సుఖినో భవంతు.



                                  












                              

Wednesday, February 8, 2012

బ్లాగ్ ఎగ్రిగేటర్లు , రచయితలు మరియు పాఠకులు క్షమించాలి.

గత రెండు రోజులుగ కొత్త పోస్ట్ పబ్లిష్ చేశాను. దురదృష్ఠమేమిటంటే, మీరు గ్రహించే ఉంటారు. అది నా పొస్ట్ లో చుక్కలుగా కనబడుతోంది. ఇది బ్రౌజర్లో కొన్ని సాంకేతిక లోపాలవలన అని గ్రహించాను.
మీ సహనమునకు, సహకారములకు నా ధన్యవాదములు.

Monday, January 30, 2012

భాస్కరుడు............

సూర్యుడు ఏ ఒక్క మతానికో లేక ఏ దేశానికో కాక విశ్వంలోని సమస్థ జీవ కోటికి  తన చక్కటి కిరణాల వలన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న అన్ని గ్రహాలకి గురువు ఈ "ఆదిత్యుడు". ఈ రోజు "రధ సప్తమి", చాలా మంచి రోజు. ఈ రోజు నుండి సూర్యుడు భూమికి దగ్గరయి భూమికి పుష్కలంగా తన శక్తిని ఇస్తాడు. సర్వ దేవమయుడయిన ఈ సూర్యదేవుని ఆరాధించడం వలన తేజస్సు, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం సూర్యోదయ కిరణాలు మన శరీరం మీద పడితే శరీరానికి ఎంతో మంచిది.
అందరికి చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ఆ "అదిత్యుడుని" మనసారా కోరుకుంటూ....................
 

Thursday, January 26, 2012

అవసరమే కదా...............


                         ప్రపంచంలో ఏ మనిషి (జాతి) అయినా  పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక  మార్గాలు పాటిస్తూనే వుంటాడు (ఉంటుంది). ఆధ్యాత్మికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు (అదొక తంతు గా ) చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం కోసమే అని ఎక్కడా చెప్పలేదు,  కర్మ కాండ చేయవలసినదే. "ఉపవాసం" అనేది శరీరానికి ఒక పూట విశ్రాంతి ద్వారా ఆరొగ్యాన్నిచ్చేందుకు. బాలగంగాధర్ తిలక్ మన దేశంలోని  "ఆకలి" అనే దారిద్ర్యాన్ని తొలగించటానికి ఒక్కోక్కరూ  ఒక పూట భోజనం మానేస్తే చాలూ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు మహానుభావులు. 


                        ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించటం కష్ఠం,  కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే ఒక సామాన్య మానవుడి యొక్క  మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు. ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి సరి అయిన దిశాదర్శనం (ముఖ్యంగా విద్యా - బుధ్ధులు ) ఇయ్యకపోతే  క్రమంగా,  క్రమశిక్షణ కు దూరమవుతాడు. అప్పుడు క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మనస్సును జయించడం   మొదలుపెట్టినప్పటినుండి పతనం (మానసిక, శారీరక) ఆరంభమవుతుంది. శారీరక ధృడత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ మానసిక దుర్భలత్వం పనికిరాదు. ఇక్కడ ఒకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, ఏ ఒక్కరికయినా మంచిని  ఆచరించటాని మనస్సు ఒప్పుకోక పోతే అతనికి  సమాజమే సరి అయిన మార్గదర్శనం ఇస్తుంది.


                        విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికతో ఉన్నట్లుగా కనబడకపోవచ్చు,  కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ప్రాధమిక విద్యా దశ నుండి ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన  విద్య ను తప్పనిసరిగ  అభ్యసించి  ఉంటాడు. 
 

                        పూర్వకాలం నుండి ఇన్ని రకములయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, అదేమిటో మన దేశంలోని వారికి అదొక "మత" (మతం తెలిపేది ఆరాధనా పధ్ధతి మాత్రమే) పరమయిన (ఆఖరికి యోగ కూడ) విద్యగా కనబడి "మడి" కట్టుకుని వాటిని తాకనీయకుండ చేసారు. కానీ  ప్రపంచంలోని ఇతర దేశంలోని వారికి అవి "మత" పరంగా కనబడకపోగా అలాంటి "ఆధ్యాత్మిక,  క్రమశిక్షణ, నైతిక విలువలతో కలిగిన విద్య" ను మన "మడి" నుండి వారు తీసుకుని తమ "ఒడి" లో బెట్టుకుని  ఎప్పుడో అక్షరాభ్యాశం చెసేశారు.  


                        మనం కోంచె సూక్ష్మంగా ఆలోచిస్తే  మన సంస్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, మన సమాజంలోని వారికే కాక ప్రపంచం లోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.


                       కొంత మంది "గ్రంధకర్తలు, సంఘ సంస్కర్తలు, చరిత్రకారులు "ఏదో ఉద్దేశ్యంతో" విలువలు లేని వాటితో మనకు (ఇప్పటి తరాని వారికి) "అక్షరాభ్యాశం" చేయించి, వారు మాత్రం  వారి కుటుంబ పాపపరిహారార్ధం అన్ని రకాల ఆధ్యాత్మిక విలువలు ఎక్కడ దొరికితే అక్కడ వాటిని భద్రంగా మూట గట్టి వాళ్ళ తరతరాల సంతానానికి అందేటట్లుగా చేసుకున్నారు.  నాదొకటే సందేహం! ఈ ఆలోచన కలవారందరూ వారి కుటుంబంలోని పిల్లలను కూడా ఇదే విధంగా అనాధ్యాత్మికంగా పెంచారా, పెంచగలరా? 

మతం: ఆరాధనా పధ్ధతిని తెలియజేస్తుంది.
  జాతి: ఉనికిని తెలియజేస్తుంది.  



అని నాఅలోచన....................................

Monday, January 23, 2012

ఋష్య శృంగ గిరి

మహర్షి ఋష్యశృంగ
                                కప్పుడు "ఋష్యశృంగ గిరి" గా పిలువబడ్డ ప్రాంతమే ఇప్పటి "శృంగేరి". ఇది కర్నాటకలోని చికమగలూర్ జిల్లాలో ఉంది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడ్డ "పీఠం".  ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాదిపతి శ్రీ సురేష్వరాచార్య. "అంగ" రాజ్యంలో 12 సం.లు వర్షాలు పడకపోవటంవలన సమస్త జీవరాసులు నశించిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఆ అంగ రాజ్యాధిపతి "రోమపాద",  విభాండక మహర్షి కొడుకు అయిన ఋష్యశృంగుడుని తన రాజ్యానికి పిలిపించగా, ఆ ఋష్యశృంగ మహర్షి అంగ రాజ్యంలో తన పాదం మోపిన వెంటనే వర్షాలు పడినాయి. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ప్రాంతమంతా సుభిక్షంగా, సశ్య శ్యామలంగా  ఉన్నది. శ్రుంగేరి కి 10KM దూరంలో "కిగ్గ" అనే గ్రామంలో ఋష్యశ్రంగుని దేవాలయం ఉన్నది.  

విద్యారణ్య స్వామి: హరిహర, బుక్కరాయలుచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసారు. ఈయన శ్రుంగేరి పీఠానికి  12వ పీఠాదిపతి. తన గురువుగారయిన "విద్యాశంకరులు" గారి మరణించునట్టి అవశెషాలమీద ఒక గొప్ప దేవాలయాన్ని  1357వ సం.లో కట్టించారు.

విద్యాశంకర దేవాలయం: ఈ దేవాలయ కట్టడంలోని 2 అంశాలు ఇప్పటికీ ప్రపంచంలోని శాస్త్రజ్ఞులకు అంతుచిక్కలేదు.

విద్యాశంకర దేవాలయం
1). ఈ దేవాలయం మొత్తం కూడా రాళ్ళతో ఒక దానిపై ఒకటి చాలా గట్టిగా పేర్చబడినవి. ఈ రాళ్ళను అతికించడానికి కనీసం చిటికెడుకూడా  ఎటువంటి "పదార్థమూ" వాడలేదు.

ముఖద్వారం
2). ముఖద్వారంగుండా లోపలకు వెళ్ళగానే అందరూ కూర్చోవడానికి వీలుగా ఉన్న గదిలో 12 రాశిచక్రములకు గుర్తుగా 12 స్తంభాలు కట్టబడినాయి. సూర్యోదయకిరణాలు ముఖద్వారంగుండా ఏ నెలకు సంభందించిన "రాశి" యొక్క గుర్తుగా లోపల ఉన్న ఆ స్థంభం మీద ఈ కిరణాలు పడేటట్లుగా ఎంతో శాస్త్ర పరంగా, సాంకేతికంగా కట్టారు.  
        
                              ఈ దేవాలయ నలుమూలలా పైవైపుగా నాలుగైదు పెద్ద పెద్ద ఇనుపరింగులతో జేసిన గొలుసువలె,  ఆ పేర్చబడిన రాళ్ళలోనే గాలికి ఉగేటట్లుగా చెక్కారు. అప్పుడొచ్చే శబ్దం గనుక వింటే అచ్చం ఇనుప గొలుసునుండి వచ్చినట్లుగానే ఉంటుంది.  
                         
                     మన దేశంలో ప్రతి దేవాలయమూ ఇలాంటి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం తో కట్టినవే. వీటిని మతపరంగా కాకుండా "శాస్త్రీయ" దృష్ఠితో చూడగలిగి, వీటిమీద పరిశొదనలు జరిపి మన సాంకేతిక పరిజ్ఞానమును మరింతగా అభివృధ్ధి జేసుకోవచ్చని 
.............. నా ఆలోచన........

Thursday, January 12, 2012

సంక్రాంతి సుభాకాంక్షలు.............

బ్లాగ్ రచయితలందరకూ........
చక్కటి విషయాలతో సమాజంలోని ప్రతి ఒక్కరికి తెలియని విషయ పరిజ్ఞానాన్ని అందజేస్తున్నందుకు.....
ఇవే నా హృదయపూర్వక సంక్రాంతి సుభాకాంక్షలు............. 
మీ అందరి
డి. యస్. ఆర్. మూర్తి...... 


Tuesday, January 10, 2012

గాలి పటాలు..........................

                         "లికాలం", "హైటెక్" యుగంలో కొన్ని సాంప్రదాయాలు కనుమరుగవుతూ ఉన్నాయి. దురదృష్ఠకరం. పూర్వీకులు ఈ పద్దతులన్నీ ఒక మంచి ఆలోచనలతో రూపకల్పన చేసారు. ఆవు పేడ, పంచకం యొక్క విసిష్ఠమయిన, శాస్త్రీయమయిన, గుణాలను దృష్టిలో పెట్టుకునే ఈ "మకర సంక్రాంతి" పండుగతో ఎక్కువగా ముడిపెట్టారు.
                         "సంక్రాంతి", "సంక్రమణం" అంటే మారడం, చేరడం అని అర్ధం. జగత్తును వెలిగిస్తూ సకల కోటినీ ప్రదీప్తం చేస్తూన్న "సూర్య భగవానుని" గతిని బట్టి "సంక్రాంతి" ఏర్పడుతోంది. ఉదయముననే లేచి చల్లటి వాతావరణములో ఇంటిముందు కళ్ళాపి చల్లి రంగవల్లులు దిద్ది, గొబ్బిమ్మలు పెట్టి, అమ్మాయిలు తలస్నానం చేసి పట్టు పరికిణి, ఓణీ, కాళ్ళకు వెండి గజ్జలు తగిలించుకుని ఇంట్లో, వీధుల వెంట అలా నడుస్తూ వెళ్తుంటే  ఆ అందం మనస్సుకు ఒకరకమయిన అహ్లాదవాతావరణమును కలుగజేస్తుంది.   
                         ఈ పండుగలనేవి ఒక ఊరులో లేదా ఒక వీధిలో వారంతా ఒకరికొకరు కలుసుకుని మంచి, చెడుల గురించి విశ్లేషించుకుని అవసరానిబట్టి ఒకరికొకరు సహాయపడటానికని ఏర్పరిచిన "సాంప్రదాయ పధ్ధతి".  
                         ఈ "మకరసంక్రాంతి" లోని "ఉత్తరాయణ పుణ్యకాలం" గురించి అందరికీ తెలిసినదే. దేవతలకు "ఉత్తరాయణం" పగలు, "దక్షిణాయనం" రాత్రి. వెలుగును అభిలషించడం జీవకోటికి సహజం కనుక పుణ్యప్రదమైన దేవలోకంలో దక్షిణాయన కాలమందు దక్షిణ ద్వారం తెరచి, ఉత్తర ద్వారం మూసియుంచుట చేత అది పాపహేతువని, ఉత్తరాయణ కాలంలో దక్షిణ ద్వారం మూసి ఉత్తర ద్వారం తీసి ఉండటం వలన అది పుణ్యప్రదమైనదని విస్వాసం. 
                         ప్రతి ఇంటి ముందు తెల్లారేసరికి ముగ్గు పెట్టడమనేది మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి. ముగ్గు పెట్టేందుకు ఉపయోగించే సున్నపురాయి, బియ్యపు పిండి తెలుపు రంగులో ఉండటం శాంతికి చిహ్నంగా భావిస్తారు. ప్రొద్దునే కళ్ళాపి చల్లి, ముగ్గుపెట్టి, శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి  ప్రవేసిస్తుందని ఓ నమ్మకం.  ముఖ్యంగా ఈ సంక్రాంతి మొదలయినప్పటినుండి ముగ్గుల రూపంలో స్త్రీలలోని సృజన బయట పడుతుంది. ముగ్గులుపెట్టడంలో, వంకర్లు లేకుండా గీతలు కలపడంలోనూ వారి ప్రత్యేకమయిన నేర్పు, ఓర్పూ తెలుస్తుంది. ఇది కూడా ఒక కళే. ఇలా ఇంటి ముందు తీర్చి దిద్దే రంగవల్లులతో ఇంటికీ ప్రత్యేక శోభ వస్తుంది.
                         భోగి పండుగ: ఈ రోజున ఆవు పేడతో చేసిన పిడకలతో మంటల వేస్తారు. శరీరానికి నువ్వుల పిండితో నలుగు పెట్టి స్నానం చేసి భోగి మంట దగ్గర చలి కాచుకోవడం వలన శరీరంలో ఉండే ఆమ్ల  గుణాన్ని హరించి శ్లేష్మాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఒంటికి నలుగు పెట్టుకోవడంవలన చర్మం పైన చేరిన మలినాలను వదిలించడమే కాకుండా చర్మానికి మృదుత్వాన్నిస్తూ, పగుళ్ళురాకుండా కాపాడుతుంది. పాతవాటిని వదిలి, క్రొత్తవాటికి స్వాగతం పలుకడము, దారిద్ర్యంవంటి చెడును మంటల్లో నశింపజేసి మంచిని ప్రసాదించమని "అగ్ని" దేవుడిని ప్రార్ధించటమూ  ఈ "భోగి" పండుగలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. విజ్ణానపరంగా చూస్తే భోగి మంటల్లో వేసే ఆవుపేడ పిడకల పొగను పీలిస్తే ఊపిరితిత్తుల చెవి, ముక్కు గొంతుల వ్యాధులు నయమవుతాయని వైద్యులు దృవీకరించారు.

                         సంక్రాంతి పండుగని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. దాదాపుగా 2500ల సం.వ. లకు పూర్వమే "విష్ణు శర్మ" తను వ్రాసిన "పంచతంత్రం" లో ఈ గాలి పటాలగురించి  ఉదహరించారు. మన దేశంలో గాలి పటాలను ఎగురవేయని ఊరు, వీధి లేదంటే అతిశయోక్తి కాదేమో. పిల్లలు, పెద్దలు ఒకరేమిటి అందరూ చాలా ఆనందంగా ఎగురవేస్తారు. గుజరాతులో "ఉత్తరాయణ" ఆరంభానికి శూచకంగా అంతర్జాతీయ పతంగుల ఆటల పోటీలు నిర్వహిస్తునే ఉన్నారు.  
 http://www.aryabhatt.com/fast_fair_festival/festivals/international%20kite%20festival.htm 
http://hinduism.about.com/cs/festivals/a/aa011103a.htm     
కావున ఈ సంధర్భముగా మీకు, మీ కుటుంబ సభ్యులెల్లరకూ ఆరోగ్యకరమయిన, ఆనందమయిన, పుణ్యప్రదమయిన జీవితాన్ని ఇవ్వవలసినదిగా "ముక్కోటి దేవతలను" కోరుకుంటూ......

Friday, January 6, 2012

మన మంచి మనతోనే వస్తుంది.............

ర్ణుడు మహాభారత యుధ్ధం తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడున్న దేవతలు సాదరంగా ఆహ్వానించి  "ఓహో!దాన, వీర, శూర కర్ణా స్వాగతం, సుస్వాగతం" అని ఆహ్వానించారు. 
లోపలికి వెళ్ళాక "కర్ణా! ఈ స్వర్గం లో ఒక నియమం ఉంది. అదేమిటంటే  నీవు భూలోకంలో ఏ ఏ దానాలు చేసావో, అవన్నీ నీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నీవు చేసినన్ని దానాలు, మరే చక్రవర్తి చేయలేదు. చివరకు కవచ కుండలాలు కూడా దానం ఇచ్చావు" అన్నారు. 
"దానిదేముంది? అవి నాకెందుకు? ఏదో నామ స్మరణ చేసుకుంటూ ఇంత తిని పడుకుంటే చాలు" అన్నాడు కర్ణుడు. 
అదే చెప్తున్నాము, నీవు భూలోకములో బంగారం ఇచ్చావు. అదే ఇస్తాము. నీవు ఒక్కరికి కూడా పిడికెడు ముద్ద పెట్టలేదు. కాభట్టి నీకు ఇక్కడ అన్నం దొరకదు అని చెప్పారు. దాంతో కర్ణుడు కంగారుపడి "మరి దీనికి మార్గమేమిట్?" అని అడిగాడు. అప్పుడు దేవతలు "నీకు నెల రోజులు సమయమ ఇస్తున్నాము. నీవు వేరే రూపం లో వెళ్ళి దాన ధర్మాలు కాకుండా అన్న దానం చేసుకురా" అని పంపారు. 
"ఎంత గొప్ప వారయినా, వీరుడైనా, శూరుడైనా గుర్తుంచుకోవలసినది మనము చేసిన మంచి మాత్రమే మనతో ఉంటుంది".

 "శుసంస్కారం" నుండి గాడి తప్పి "కుసంస్కారం" లోకి వెళ్ళకుండ  వుండటానికే, విలువగల విషయము తెలిసినదే అయినా మరచిపోకూడదని  నిత్యం మననం చేసుకుంటూ ఉంటాము. 
సదా సుఖీభవ.....