Pages

Monday, December 19, 2011

దేశాభి వృద్ధి.....


కరెక్టే చాలా మంది అనుకోవచ్చు, పూర్వం మనము చాలా గొప్ప వాళ్ళమే అయితే ఏమిటి, 
ఇప్పుడు కాదు గదా. అసలు అభివ్రుధ్ధికి ఎటువంటి సిధ్ధాతమయినా ఆచరించటానికి, అమలుపరచటానికి చిత్తసుధ్ధి ఉండాలి మన పూర్వీకుల నుండి తగిన స్ఫూర్తిని పొందగలగాలి. మన విద్యా విధానాన్ని నేటి విద్యార్ధులకు ప్రపంచం లో గల ఆధునిక పరిజ్ఞానం తో కూడిన విద్య తో పాటు
మన "దేశం" మీద అవగాహన, అభిమానాన్ని ఉన్నతమయిన ఆశయాలను కలుగజేసే విధంగా మార్చుకోవాలి.
. ప్రపంచంలో ఏ మనిషికయినా పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక మార్గాలు పాటిస్తూనే వుంటారు. ఆధ్యాతిమికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం అని ఎక్కడా చెప్పలేదు, 
ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించలేము, కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే మన మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు, ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటినుండి సరి అయిన దిశాదర్శనం(ముఖ్యంగా విద్య) సరిగా చేయకపోతే క్రమంగా క్రమశిక్షణ కు దూరమవుతాడు. క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మన మనస్సును జయించటం మొదలుపెట్టినప్పటినుండి మన పతనం(మానసిక, శారిరక అన్నీ)మొదలవుతుంది. ఇక్కడ మనమొకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, మనం ఆచరించటాని మన మనస్సు అంగీకరించకపోయినా మనకు సమాజమే సరి అయిన మార్గదర్శనం చేస్తుంది. 
విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికంగా కనపడడు, కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ఆధ్యాతికత, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉంటాడు.ఇన్ని రకాలయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, మన దురదృష్ఠమేమిటంటే  మనం తప్ప ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కలిగిన విద్యా భోదన  కు ఎప్పుడో "శ్రీ"కారం చుట్టారు. 
మనం కోంచె సూక్ష్మంగా చూస్తే మన సంశ్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, సమాజంలోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.
 ఇప్పుడున్న పరిస్థుతలకి అప్పటిగొప్పతనానికి లింకేమిటి? ---- Well, correct. There is no link. మరి అలాంటప్పుడు ఇతర దేశస్తుల పూర్వపు గొప్పదనాన్ని చిన్నాపిల్లల పాఠ్యాంశాలలో చొప్పించడం NCERT - 7th Class - Chapter "India and the World" page 75 - The Invention of paper and silk are the greatest contribution of the Chinese to the World.  మరి ఈ చరిత్ర  వూహించినదా లేదా వాస్తవమా, వాస్తవమయితే నిదర్శనమేమిటి. అలాంటప్పుడు "Zero" మనమే కనుగొన్నా మని కూడా వ్రాయవచ్చుగదా, అప్పుడు పిల్లలు motivate అవుతారు. మరి ఇప్పుడున్న పరిస్థితి  నుండి   ఉన్నతమయిన, అభివ్రుధ్ధిచెందిన దేశంగా ఎదగాలంటే ముందుగా ఏ రంగాల మీద ద్రుష్ఠి సారించాలి! అది ఎలా జరుగుతుంది!
ప్రస్తుతం అభివృద్ది చెందిన దేశాలు దే రకమయిన ఆలోచనలను అమలుపరిచారు. 
1. వ్యవసాయం: ఆహారోత్పత్తుల రంగంలో అభివ్రుధ్ధి - ఆహార భద్రతని కల్పిస్తుంది.  
    ఉద్యోగావకాశాలనిస్తుంది. తరువాత ఆర్ధికాభివ్రుధ్ధికి దారి తీస్తుంది.
2. విద్యుత్ రంగం: విద్యుత్ సరఫరా అన్నిరంగాలకి కీలకాపరమయిన ఇంధన భద్రతనిస్తుంది. 
3. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు: దీని అభివ్రుధ్ధి చిన్న కుటుంబాలను ప్రోత్సహిస్తుంది. 
వాటినుంచి సమర్ధవంతమయిన పనివాడితనం సాధ్యపడుతుంది. అటువంటి 
పనితనానికి ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువ. అది సాంఘీకాభివ్రుధ్ధికి కూడా దారితీస్తుంది.
4. Information & Technology: ఈ రంగంలో అభివ్రుధ్ధి మొత్తం అభివ్రుధ్ధి కార్యక్రమాన్ని 
వేగవంతం చేస్తుంది.
5. వ్యూహాత్మక రంగం: తక్కిన ముఖ్యరంగాలయిన పరిస్రమలు, అభివ్రుధ్ధి నిలకడగా, సాంకితేక 
పరిజ్ఞానాలమీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పైనుదహరించిన 5రంగాల 
సంయుక్త ప్రభావం వల్ల స్థూల జాతీయాదాయం పెరుగుదలకు సాధ్యపడుతాయి. 
అసలు మనం అభివ్రుధ్ధిచెందలేదు అని ఎవరన్నారు. ఇప్పటికి "Mathematics" లో మనమే 
ముందున్నాము. అందుకనే దీంట్లో "నోబుల్ ప్రైజ్" పెట్టలేదు. సైన్సు లో చాల ముందున్నాము.
ఎటొచ్చి "దేశాభిమానం" లో వెనుక బడి ఉన్నాము. దీన్ని సరిచేసుకుంటే చాలు, 
మన పూర్వ వైభవం తిరిగి పొందవచ్చు.





2 comments: